న‌టి దాన‌మిచ్చిన స్థ‌లంలో ఆల‌యం, విలువ కోట్ల‌లో!


అల‌నాటి న‌టీమ‌ణి కాంచ‌న‌. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో, స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌కంటూ శాశ్వ‌త కీర్తిని క‌లిగిన న‌టీ మ‌ణి. ఇప్పుడు పెద్దావిడ‌. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో నాయ‌న‌మ్మ పాత్ర‌ను చ‌క్క‌గా ర‌క్తి క‌ట్టించి, ఈ త‌రానికీ న‌వ్య‌నూత‌న బామ్మ‌గా ప‌రిచ‌యం అయ్యారు.
ఇక దైవ‌భ‌క్తి మెండుగా క‌లిగిన కాంచ‌న చాలా యేళ్ల కింద‌ట చెన్నైలో త‌న సొంత స్థ‌లాన్ని టీటీడీకి విరాళంగా అందించారు. ఇప్పుడు ఆ స్థ‌లంలో అమ్మ‌వారి ఆల‌య నిర్మాణానికి సిద్ధం అవుతోంది టీటీడీ. అందుకు సంబంధించి ఎల్లుండి భూమి పూజ జ‌ర‌గ‌నున్న‌ద‌ని టీటీడీ త‌మిళ‌నాడు స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. సుమారు ఏడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి అమ్మ‌వారి ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.
టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ నిర్మాణానికి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, కంచికామ‌కోటి పీఠాధిప‌తి హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ఆల‌య నిర్మాణంలో త‌ను వ్య‌క్తిగ‌తంగా కూడా భాగ‌స్వామి కాబోతున్న‌ట్టుగా శేఖ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించుకున్నారు. సుమారు కోటి రూపాయ‌ల‌కు పైగా త‌ను సొంతంగా వెచ్చిస్తున్నార‌ట ఆయ‌న‌.
విశేషం ఏమిటంటే.. కాంచ‌న విరాళ‌మిచ్చిన స్థ‌లం ప్ర‌స్తుత మార్కెట్ విలువ తెలిస్తే బైర్లు క‌మ్మాల్సిందే. ఆమె స్థ‌లం రూపంలో ఇచ్చారు, అయితే ఇప్పుడు మార్కెట్ విలువ ప్ర‌కారం చూసుకుంటే దాని విలువ సుమారు 30 కోట్ల రూపాయ‌ల‌ట‌! స్థ‌లాల విలువ‌లు ఈ స్థాయికి చేర‌ని రోజుల్లో కాంచ‌న దాన్ని కొనుగోలు చేసి ఉండొచ్చు. అయితే ఆమె విరాళం విలువ ఇప్పుడు ఏకంగా 30 కోట్ల రూపాయ‌ల‌కు చేర‌డం, అక్క‌డ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వెలుస్తూ ఉండ‌టం సుకృత‌మే!

About The Author