కాపులకు తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం !


? కాపులకు తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం !
? అధికారం చేపట్టిన వెంటనే కాపు రిజర్వేషన్లు రద్దు చేసి వక్ర బుద్ది బయటపెట్టుకుంది !!
? సీపీఐ అభ్యర్థి నక్కా వీరభద్రరావుని గెలిపించి అభివృద్ధిని స్వాగతించండి !!!
? మాజీ శాసన సభ్యులు బోండా ఉమా !!!

(గాంధీ నగర్, విజయవాడ) వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు రిజర్వేషన్లు రద్దు చేసి తన వక్రబుద్ధి ని బయటవేసుకున్నదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. ఆదివారం ఉదయం 36వ డివిజన్ తెలుగుదేశం బలపరిచిన సీపీఐ అభ్యర్థి నక్కా వీరభద్రరావు విజయాన్ని కాంక్షిస్తూ డివిజన్లోని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుండి ప్రచార యాత్ర బయలుదేరింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ మాట్లాడుతూ కాపు సంక్షేమ సంస్థ నుండి నిధులను దారి మళ్లించి నవరత్నాల కి వాడుకుంటున్నారని అన్నారు. కాపు రిజర్వేషన్లను అమలు చేసి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు టివి రమణ మూర్తి, మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author