తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు
• కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం స్వామి వారి దర్శనం
• సామాన్య భక్తునిలా వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనానికి వెళ్ళిన ఉపరాష్ట్రపతి
• దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం ప్రార్థన

కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్ళారు.

దర్శనం అనంతరం రంగ మండపంలో ఉపరాష్ట్రపతి కుటుంబానికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

About The Author