శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న నాంది చిత్ర బృందం


శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న నాంది చిత్ర బృందం మరియు హీరో అల్లరి నరేష్ గారు.

ముందుగా వారికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం ఆనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆనంతరం శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువాతో సన్మానించి స్వామివారి
చిత్రపటాన్ని అందచేశారు.

అలాగే హీరో అల్లరి నరేష్ గారికి మరియు చిత్ర బృందానికి భవిష్యత్తులో మరెన్నో గొప్ప విజయాలు చేకూరాలని అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారు పాల్గోన్నారు.

About The Author