చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి


చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతిచెందిన ఘటన తిరుపతి
ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు ఇలా ఉన్నాయి.. పీలేరు మండలం ఎర్రగుంట పల్లె గ్రామం చెందిన లేట్ రామచంద్రరాజు కుమార్తె పి చరిత్ర 17 సంవత్సరాలు. మంగళవారం సాయంత్రం తిరుపతి తుమ్మలగుంట క్యాంపస్ నందు ఎం.పీ.సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి, క్యాంపస్ లోని హాస్టల్ నందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం మృతి చెందిన విద్యార్థిని రుయా హాస్పిటల్ కి తరలించారు. అప్పటికేమృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. విద్యార్థి శరీరంపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం . దీనిపై చరిత్ర బంధువులు ఎం.ఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నర్సింహులు కేసు నమోదు చేసి మృతికి కారణాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author