నిజామాబాద్ లో కరోనా కల్లోలం..గంట వ్యవధిలోనే దంపతుల మృతి


*నిజామాబాద్:* తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులే కాదు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇటీవలే జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది.

కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆర్మూర్ ఎంఐఎం నేత గోరేమియా ఇటీవల కరోనా బారినపడ్డారు.

దీంతో కుటుంబసభ్యులు కూడా టెస్ట్ చేయించుకోగా ఆయన భార్యకు కూడా పాజిటివ్ గా తేలింది.

దీంతో దంపతులిద్దరూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.

ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) ఉదయం గోరేమియా ఆరోగ్యపరిస్థితి మరింత క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన మృతదేహాన్ని ఆర్మూరుకు తరలించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా మరో విషాదం చోటుచేసుకుంది.

ఆయన భార్య ఆరోగ్యం కూడా క్షీణించి చనిపోయారు.

ఇలా కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలను కరోనా బలితీసుకుంది.

ఇలా ఒకేసారి దంపతులిద్దరు మృతిచెందడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది.

About The Author