ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త


వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే తాలూకా బీమనబీడు గ్రామానికి చెందిన మహిళ (25)తో 30 ఏళ్ల వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. బుధవారం రాత్రి మహిళ ప్రియునితో కలిసి ఉండగా ఆమె భర్త కట్టె, కత్తితో ప్రియునిపై దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని మైసూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గుండ్లుపేటే పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేశారు.

About The Author