కేదార్‌నాథ్‌ లో ఆది శంకరాచార్యుల విగ్రహాం


ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్‌ లో గురు ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని క్రీ.శ 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది.2013లో వచ్చిన వరదలతో పాత విగ్రహం దెబ్బతినటంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కృష్ణశిల ​​రాతితో చేసిన 12 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం ఈ నెల 25న పెద్ద ఆర్మీ హెలికాప్టర్ ద్వారా మైసూర్ నుంచి రవాణా చేయనున్నారు.ఆలయం వెనుక నిర్మించిన ఆది గురు శంకరాచార్యుల సమాధి వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.మైసూరులోని సరస్వతిపురంలో చెక్కబడిన ఈ విగ్రహం తీవ్రమైన వర్షంతో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితితులను తట్టుకుంటుంది నిపుణులు తెలిపారు.

About The Author