నా భర్త నాకు కావాలి.. భార్య నిరసన…


తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య నిరశన చేపట్టిన ఘటన గురువారం కోటనరవలో సంచలనం రేపింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం మల్కాపురానికి చెందిన లావణ్యకు కోటనరవకు చెందిన దొడ్డి త్రినాథ్‌తో 2017లో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. ఆ తర్వాత ఆడపడుచులు, అత్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పెద్దల సమక్షంలో గొడవలు సద్దుమనిగేలా చేసుకున్నారు.ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం లావణ్యకు త్రినాథ్‌ విడాకుల నోటీసు పంపించాడు. మరో పెళ్లి చేసుకునేందుకే విడాకుల నోటీసులు పంపించారని, తనకు భర్త కావాలని ఆమె వేడుకుంటోంది. గతంలో దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. తనకు జరిగిన అన్యాయం మరో మహిళకు జరగకూడదని, తన భర్త తనకు కావాలని వేడుకొంటోంది. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఆందోళన చేపట్టిన మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

About The Author