భూమన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన శాలివాహనలు

తిరుపతి ;కవయిత్రి  మొల్లవిగ్రహ ఏర్పాటుకు సహకరించినతిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, యువనేత,  కార్పొరేటర్ భూమన అభినయ్ రెడ్డి కి ఆంధ్ర ప్రదేశ్ కుమ్మర, శాలివాహన సంక్షేమ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పద్మావతి పురం లోని భూమన నివాసంలో కరుణాకర రెడ్డి ని,  అభినయ రెడ్డి ని సోమవారం సంఘం ప్రతినిధులు,వేర్వేరుగా కలసి, కృతజ్ఞతా పూర్వకంగా  సత్కరించారు.  సుమారు 15 సంవత్సరాలుగా నగరంలో లో మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు

ఎంతోమంది ప్రజాప్రతినిధులను, ప్రముఖులను కలిసి వినతి  పత్రాలను అంద జేసినప్పటికీ… వారెవరు స్పందించలేదన్నారు.  అయితే భూమన కరుణాకర రెడ్డి,  భూమన అభినయ్ రెడ్డి తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయ, సహకారాలు అందించారని, మాట  నిలబెట్టుకున్నారని తెలిపారు.  కుమ్మర శాలివాహనుల కల నెరవేరుస్తున్న భూమన కుటుంబానికి  రుణపడి ఉంటామన్నారు.  ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బి వి కేశవులు,  ముని చంద్ర, వేణు, రోశయ్య , విజయలక్ష్మి,  శంకరయ్య,  విజయ్ మురళి  తదితరులు పాల్గొన్నారు.

About The Author