భారత హాకీ జట్టు ఘన విజయం

టోక్యో : ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. నాలుగో క్వార్టర్‌లో మూడో గోల్‌ చేసి విజయాన్ని అందుకుంది. రూపిందర్‌ పాల్‌ రెండు గోల్స్‌(15 ని, 51 ని)తో అదరగొట్టగా.. 14 వ నిమిషంలో సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మరో గోల్‌ చేశాడు.

About The Author