దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. నిన్న 30వేలకు దిగువన కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 43,651 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,678 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇప్పటి వరకు మహమ్మారి బారి నుంచి 3,06,63,147 మంది కోలుకున్నారని తెలిపింది. మహమ్మారితో మొత్తం 4,22,022 మంది కన్నుమూశారని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 44,61,56,659 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

About The Author