ఐదు ఎర్రచందనం దుంగలతో ఒక. స్మగ్లర్ అరెస్టు

చిత్తూరు జిల్లా:నాగపట్ల వెస్ట్ బీట్ బి.కొంగరవారి పల్లి అటవీ ప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక తమిళ స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు బుధవారం ఆర్ ఎస్ ఐ సురేష్ టీమ్ నాగపట్ల బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు.  గురువారం తెల్లవారు జామున బి.కొంగరవారి పల్లి సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో స్మగ్లర్లు కనిపించారు. వారిని చుట్టు ముట్టగా దుంగలు పడేసి పారిపోయారు. అయితే ఒకరిని పట్టుకో గలిగారు. ఇతనిని తమిళనాడు విల్లుపురం జిల్లా, చిన్నసేలం తాలూకా ముత్తు (53) గా గుర్తించారు. సిఐ వెంకట్ రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సిఐ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.

About The Author