మా మధ్య విభేదాలు సృష్టిస్తే తీవ్రపరిణామాలు తప్పవు

చిత్తూరు జిల్లా;సత్యవేడు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తో తాను విధిస్తున్నట్లు అనవసర వదంతులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు చేరుకోవాల్సిన ఉంటుందని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి హెచ్చరించారు. సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో తాను స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు చేస్తున్న వదంతులపై డిప్యూటీ సీఎం పిచ్చాటూరు విలేకరులతో మాట్లాడారు. తన తమ్ముడి లాంటి ఆదిమూలం తో తనకు విభేదించాల్సిన అవసరం ఎన్నటికీ తలెత్తదన్నారు. కొందరు పనిగట్టుకొని ఎస్సీ నాయకులైన తమ ఇద్దరిపై అనవసర రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించలేదన్నారు. తామంతా ఓకే గ్రూప్ అని.. అది జగనన్న గ్రూప్ అని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఇకపై తమ మధ్య ఇలాంటి అనవసర వదంతులు సృష్టించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు

About The Author