రోడ్డు బాగు చేయాలని నిరసన.. జనసేన

చిత్తూరు జిల్లా;వెదురు కుప్పం…  ( చిత్తూరు )గుంతల మాయమైన రోడ్డు ను బాగు చేయాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పొన్నా యుగంధర్, కార్యకర్తలతో కలిసి బురద నీటిలో బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇందుకు సంబంధించి వివరాలు… చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ,వెదురుకుప్పం మండలం, మాంబేడు పంచాయతీ , పరిధిలో గెరిగిదొన గ్రామం సమీపంలో  పచ్చికాపలం నుంచి కార్వేటి నగరం కు  వెళ్లే జాతీయ రహదారి గుంతల మయం అయింది. వాన వస్తే నీరు పూర్తిగా నిండిపోయి రోడ్డు కనిపించక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన సైనికులు అక్కడికి చేరుకుని ప్లే కార్డులు చేతబట్టి బురద నీటిలో కూర్చుని నిరసన తెలియజేశారు అధికారులు స్పందించి బాగు చేయాలని కోరారు.

About The Author