తిరుపతి ఘాట్ రోడ్డులో కారు బోల్తా..హైదరాబాద్ భక్తులకు తీవ్రగాయాలు..


తిరుమలకు చాలా మంది రోడ్డు మార్గంలో, నడక మార్గంలో అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్టు గుండా వెళ్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనాలకు 24 గంటల వరకు సమయం పడుతుంది. మరోవైపు రూ. 300 దర్శనాలకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఎస్ఎస్ డీ టోకెన్లు ఉన్న భక్తుల దర్శనాలకు 4 గంటల సమయం పడుతుంది.

ఈ క్రమంలో తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం కారు అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు తమకారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికి బయలు దేరారు. ఇంతలో తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి సెఫ్టీ గోడను బలంగా ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వెంటనే అక్కడున్న భక్తులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో ఆ మార్గంలో కొంచెంసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాట్ రోడ్డులో ఉన్న సిబ్బంది కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ప్రమాదంలో ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు సైతం తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. మరోవైపు తిరుమలలో ప్రమాదం గాయపడ్డ భక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

About The Author