తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్

తిరుపతి జూలై 30: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 78 మంది వాహనదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానా విధించారు.

అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణలో దాని ప్రాధాన్యత, మోటారు వాహనాల చట్టం ప్రకారం

About The Author