మొదటి ఘాట్ రోడ్ లో బోల్తాపడ్డ కారు

తిరుపతి,2026, 07, ఆగస్టు,తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు/ఐదుగురికి గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది.
తిరుమల నుండి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు, 22వ హెయిర్పిన్ బెండ్ మలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలో పడింది.
తీవ్రంగా గాయపడిన 72 ఏళ్ల సతీశ్ కుమార్ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కారులో ఉన్న కుటుంబ సభ్యులు సాయి శ్రీనివాస్, సింధు ఉడత్, మరియు పిల్లలు తియా, నైరాలకు స్వల్ప గాయాలయ్యాయి
స్థానికులు, తోటి ప్రయాణికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు..
బెంగళూరులోని గొట్టిగేరి బన్నేరుగట్ట రోడ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు భక్తులు ప్రయాణిస్తున్నారు.
