టిడిపి ప్రభుత్వంలోనే కాపులకు సామాజిక న్యాయం..

….తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో కాపులకు సామాజిక న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థి డికె సత్యప్రభ అన్నారు ఆదివారం రాత్రి రైల్వేకోడూరు పట్టణంలోని తేజా కల్యాణ మంటపంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో కాపులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు మంత్రి పదవులతో పాటు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారని ప్రత్యేక నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గానికి తగిన న్యాయం చేశారని అన్నారు రాబోయే ఎన్నికలలో కాపులంతా ఏకతాటిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు అన్నిరాష్ట్రాల లో ఏ పార్టీ కూడా కాపులకు తగిన స్థానం కల్పించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతగాని ఆటా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ బొక్కసం చలపతి డాక్టర్ జలపతి గునిపాటి చెన్నరాయుడు మందల కొండయ్య అనుమల గండం చంద్రమోహన్ బండి కృష్ణయ్య అన్నేళ్ల కంటయ్య బొక్కసం సునీల్ నాగినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

About The Author