ఇన్ కమింగ్ కాల్స్ కూ ఇక రీచార్జ్ …

ఇన్ కమింగ్ కాల్స్ కూ ఇక రీచార్జ్ …

మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు షాకిచ్చేలా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ప్లాన్‌లను రద్దుచేయాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా సంస్థలు నిర్ణయించాయి. టెలికం సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో భవిష్యత్తులో ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సైతం డబ్బులు చెల్లించాల్సిందే. ఈ సేవలను కొనసాగించేందుకు సంబంధిత కంపెనీల చందాదారుల కనీస రీఛార్జిలు చేయించుకోవాల్సి ఉంటుంది. టెలికం మార్కెట్లోకి రిలయన్స్‌ జియో ప్రవేశంతో తమ ఆదాయానికి గండి పడటంతో.. ఈ సంస్థలు జియో పోటీని తట్టుకొనేందుకు ప్రస్తుత టారిఫ్‌లలో మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పథకాలకు స్వస్తి పలకనున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా సంస్థలు కనీస రీఛార్జి పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సంబంధించి నిమిషాల చొప్పున ఛార్జీలు వడ్డించకుండా కనీస రీఛార్జిలను చేసుకున్న వారికి నిర్ణీత కాలానికి ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్ ‌సదుపాయాన్ని అందించనున్నాయి. అందులో భాగంగా రూ.35, రూ.65, రూ.95తో రీఛార్జి ప్లాన్‌లను ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంబంధిత రీఛార్జి పథకాల ద్వారా 28 రోజల పాటు డేటా, టాక్‌టైం లభించడంతో పాటు ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సౌకర్యం కూడా లభిస్తుంది. ఇదే తరహాలో రూ.30లతో కనీస రీఛార్జి పథకాన్ని తీసుకురావాలని వొడాఫోన్‌ -ఐడియా సంస్థ కూడా నిర్ణయించింది.

About The Author