వేలాది మంది పర్యాటకులతో జలపాతానికి జన కళ…

ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయగార బొగత జలపాతానికి ఆదివారం వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. అక్కడ ప్రకృతి అందాలు చూసి మైమరచిపోయారు. జలపాతం ముందు ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో స్నానాలు చేసి సందడి చేశారు. జలపాతం వద్ద ఉన్న ముందు వ్యూ భాగంలో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. కుటుంబాల సమేతంగా తరలి వచ్చిన టూరిస్టులు టెంట్లు వేసుకొని వంటలు వండుకుని భోజనాలు చేశారు.

About The Author