ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌…


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత #బిశ్వభూషణ్‌_హరిచందన్‌_గారిని కేంద్రం నియమించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఈరోజు రాష్ట్రపతి భవన్ జారీ చేసింది .

1980-88 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన బిశ్వభూషన్‌.. సోషల్ వర్కర్‌గా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉండే హక్కుల గురించి పోరాటం చేశారు. అనంతరం జనసంఘ్ లో, ఆ తర్వాత బీజేపీలో చేరారు.

5 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా,
ఒడిశా న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు.
ఇక….రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్‌ను కొనసాగించాలనే నిబంధన ఉంది….
ఐదేళ్లు పూర్తి కావడంతో….
ఏపీకి గవర్నర్‌గా #నియమించారు….

About The Author