ఆర్టీసీ బస్సులో 80 కిలోల గంజాయి పట్టివేత…

ప్రకాశం జిల్లా మార్టూరు, బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద #APSRTC బస్సులో తరలిస్తున్న గంజాయిని అధికారులు పట్టుకున్నారు.
#విజయవాడ నుంచి #తిరుపతి వెళుతున్న, #వెంకటగిరి డిపో ఆర్టీసీ బస్సులో(AP26TD2669) గంజాయి తరలిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ.
ముందస్తు సమాచారంతో రాత్రి నుంచి నిఘా పెట్టిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు,నిందితుల వద్ద నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న మరికొందరి కోసం తనిఖీలు ముమ్మరం చేసారు. గంజాయి అక్రమ తరలింపులో ఆర్టీసీ సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా…? అన్న కోణంలో కుడా దర్యాప్తు చేస్తామన్నారు అధికారులు. తదుపరి విచారణ నిమిత్తం, బస్సును కూడా అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్మెంట్ అధికారులు.

About The Author