జల్లెడ పడుతున్న పోలీసులు… జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఎలర్ట్…
మండపేట(తూర్పుగోదావరి జిల్లా):- పథకం ప్రకారం మాటు వేసి ఓ బాలుని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు .దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండపేట విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మ తో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ (4) అనే బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి నాయనమ్మను కొట్టి ఎత్తుకు పోయారు.ప్రశాంతంగా ఉండే మండపేటలో కిడ్నాప్ సంఘటన వులిక్కిపడినట్లుగా చేసింది. స్థానిక విజయలక్ష్మి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్న నూక వెంకటరమణ కుమారుడు జషిత్(4) ను నాయనమ్మ పార్వతి సమీపంలో ని అపార్టుమెంట్ వద్దకు ఆదుకునేందుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ నుండి తాము నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారి లోని శ్రీ సాయి ధరణి ప్లాజా కు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ ప్రశ్నించాడు. వెను వెంటనే ఆమె పై పిడి గుద్దులు గుద్ది గాయ పర్చాడు.వెంటనే బాలుడిని ఎత్తుకుని మోటర్ సైకిల్ పై బాబు ను ఎత్తుకెళ్లాడు. కొద్దిదూరం పరుగులు తీసిన పార్వతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమి గుడారు.విషయంతెలుసుకుని వెంటనే బైపాస్ రోడ్ లో వెళ్లారు.మోటార్ సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు వెళ్లడాన్ని గమనించిన వారు వాహనాన్ని వెంబడించారు.అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దీంతో పోలీసులు ఎలార్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్టారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి ఆచూకీ కనుగొనేందుకు రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్ నేతృత్వంలో రూరల్ సిఐ మంగాదేవి, టౌన్,రూరల్ ఎస్ ఐ లు రాజేష్ కుమార్,దొరరాజు లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టల్సిఉంది. ఎవరైనా తెలిసిన వారే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాదితుల నుండి పోలీసులు వివరాలు సేకరించారు.

శ్రీకాకుళం నుండి వచ్చి….

ప్రశాంతత కు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్ట పడారు. అలాంటి పట్టణంలో కిడ్నాప్ కలవరపాటు కు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన భార్య భర్త లు చెరో బ్యాంక్ లో ఉద్యోగలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నూక వెంకట రమణ ది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస స్వస్థలం. ఉద్యోగం లో స్థిరపడ్డ అనంతరం శ్రీకాకుళం పట్టణంలో ఇల్లు నిర్మించుకున్నరు. ఆరు నెలలు క్రితం మండపేట యూనియన్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా వచ్చారు.ఈయన భార్య బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నాడు.కాగా ఆమె ఇప్పుడు నిండు గర్భిణీ. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కిడ్నాప్ కన్నీళ్లు రప్పిస్తుంది. ముద్దులు ఒలికించే జషి త్ అంటే అక్కడి అపార్టుమెంట్లు వారందరి ఎంతో ఇష్టం.అలాంటి చిన్నారి కిడ్నాప్ కావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి బ్యాంకు సహా ఉద్యోగులు అక్కడికి చేరుకుని వారిని ఓదరించారు.తన కుమారుడు ఆచూకీ కోసం ఆ తల్లి తల్లడిల్లడం చూపరులను సైతం కంట కన్నీరు రప్పించింది. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డి ఎస్ పి కోరారు.

About The Author