పాలాభిషేకం అందుకున్న సీఎం జగన్…


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేసినందుకుగాను వైసిపి ఎస్సి సెల్‌ ఆధ్వర్యంలో వాల్మీకిపురం గాంధీ విగ్రహ కూడలి వద్ద ముఖ్యమంత్రి జగన్‌ వెూహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి విటలం వెంకట స్వామి, మండల సహాయ కార్యదర్శి గుండ్లురి మహేష్‌ లు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు జానం గంగిరెడ్డి, బీసీ నాయకుడు రాచయ్య, రమణ మూర్తి, సుమిత్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author