ఐజి కాంతారావు గారికి ఘనంగా వీడ్కోలు…

అమరావతి లోని లీగల్ మెట్రలజీ విభాగానికి కంట్రోలర్ గా బదిలీ పై వెళుతున్న టాస్క్ ఫోర్స్ ఐజి శ్రీ డాక్టర్ ఎం కాంతారావు గారిని టాస్క్ ఫోర్స్, పోలీస్, ఫారెస్ట్ సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన పూల రధాన్ని ఉద్యోగులు లాగుతూ ఆయనను సాగనంపారు. మరో వైపు పూల వర్షం కురిపుంచారు. కార్యాలయం నుంచి కపిలతీర్థం వరకు రధం పై ఊరేగించి తమ అభిమానాని చాటుకున్నారు.. టాస్క్ ఫోర్స్ ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవి శంకర్, డీఎస్పీలు వెంకట రమణ, అల్లా బక్ష్, ఎసిఎఫ్ కృష్ణయ్య, వైల్డ్ లైఫ్ డీఈఫ్ ఒ నాగార్జున రెడ్డి, ఆర్ ఐ చెందు, మురళీ, భాస్కర్, ఆర్ ఎస్ ఐ విజయ్, వాసు, లింగాధర్, సిసి సత్యనారాయణ, నాగేంద్ర , ఎఫ్ఆర్వో ప్రసాద్, ఫారెస్ట్ , పోలీస్ ఉన్నతాధికారులు, ఆధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు కాంతారావు గారిని సిబ్బంది ఘనంగా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి జ్నాపికను అందజేశారు.‌ ఈ సందర్భంగా ఐజి గారు సిబ్బందికి విందు ఏర్పాటు చేశారు.

About The Author