మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా


తెలుగు రాష్ట్రాల్లో మరో మారు ఎన్నికల నగారా మ్రోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ను అనుసరించి ఏపీలో మొత్తం మూడు స్థానాల్లో ఎన్నిక నిర్వహిస్తుండగా.. తెలంగాణలో ఒక స్థానంలో ఎన్నిక నిర్వహించనున్నారు.

తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ను పరిశీలిచిననట్లయితే ఏపీ, తెలంగాణలో రాష్ట్రాల్లో కలిపి మొత్తం నాలుగు స్థానాలకు ఈ నెల 7న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. కాగా..16న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, 19 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. కాగా ఈ నెల 26వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.

About The Author