తిరుపతిలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్…


కడప జిల్లా రైల్వేకోడూరు కు చెందిన 20 ఏళ్ల ద్వారకనాథ్ అనే విద్యార్థిని హతమార్చిన విద్యార్థులు. తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్ ను
శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించి హత్య చేసిన విద్యార్థులు. బీరు బాటిల్ లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డ స్టూడెంట్స్ గ్రూప్.
విద్యార్థుల మధ్య గొడవలే హత్యకు కారణమని భావిస్తున్న అలిపిరి పోలీసులు. తల్లిదండ్రులు కువైట్ లో ఉంటుండగా ఏడాదిన్నర క్రితం చదువుకునేందుకు తిరుపతికి వచ్చి శెట్టిపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్న ద్వారకనాథ్. హత్యకు పాల్పడ్డ యువకుల కోసం గాలింపు.

About The Author