ఆగస్టు 30న శ్రీ కపిలేశ్వర ఆలయంలో లక్ష కుంకుమార్చన

 

ఆగ‌స్టు 30న శ్రీ కపిలేశ్వర ఆలయం లో

లక్ష కుంకుమార్చన

 టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 30వ తేదీ శుక్ర‌వారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

రూ.200/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) లక్ష కుంకుమార్చన సేవ‌లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ల‌డ్డూ, కుంకుమ ప్ర‌సాదంగా అందజేస్తారు. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.    

About The Author