పుట్టినరోజు కేక్ లో బాబాయ్ విషం కలిపాడు..ఇక అంతే…


పుట్టినరోజు కేక్ లో బాబాయ్ విషం కలిపాడు..
తండ్రీకొడుకులు మృతి, ప్రాణాపాయంలో తల్లి, చెల్లి..
=======================================
పుట్టినరోజు పండగే ఆ కుటుంబంలో విషాదం అయింది. విషపూరితమైన కేక్ తిని పుట్టినరోజు జరుపుకున్న బిడ్డ రామ్ చరణ్(8), తండ్రి రవి(38) చనిపోగా.. తల్లితోపాటు మరో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్నారు. పుట్టినరోజు జరుపుకోమని రామ్ చరణ్ చిన్నాన్న ఈ కేక్ పంపించారని చెబుతున్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయని, ఈ నేపథ్యంలో కేక్ లో విషం కలిపి పంపి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

About The Author