టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు…


టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు వైవీ ఆహ్వానం మేరకే అఘోరాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. పూజల అనంతరం అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్,వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి శనివారం అఘోరాలు విచ్చేశారు.హిమాలయాల నుంచి వచ్చిన ఈ అఘోరాలు విజయవాడలోని వైవీ ఇంటికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వైవీ ఆహ్వానం మేరకే వారు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. పూజల అనంతరం అఘోరాలు వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం స్వీకరించారు.వైవీ ఇంట్లో అఘోరాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

About The Author