టాస్క్ ఫోర్స్ లో ఘనంగా గాంధీ జయంతి

 

తిరుపతి కపిల తీర్థం సమీపంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో మహాత్మాగాంధీ 150వ జయంతి బుధవారం ఘనంగా జరుపుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ గారు గాంధీ చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. పూలతో అంజలి ఘటించారు. తరువాత ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు అందరూ గాంధీ సిధ్ధాంతాలను అనుసరించాలని కోరారు. గాంధీ గారు 150వ జన్మదినం దేశ వ్యాప్తంగా జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. తరువాత ఆయనతో పాటు డీఎస్పీలు అల్లా బక్ష్, వెంకటయ్య, ఎసిఎఫ్ కృష్ణయ్య, ఆర్ ఐ లు మురళీ, చెందు, సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ ఎస్ ఐ వాసు ఇంకా డీఎన్ కె ప్రసాద్, సిసి సత్యనారాయణ తదితరులు నివాళులు అర్పించారు.

About The Author