స్వర్గీయ డాక్టర్ నారమల్లి శివప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తాం,

తిరుపతి చిత్తూరు జిల్లా: పేద ప్రజలకోసం వెనకడుగు వేయకుండా శాయశక్తులా పని చేయాలని మామగారు చూపిన బాటలో పయనిస్తామని అన్నారు మాజీ ఎంపి డాక్టర్ శివప్రసాద్ అల్లుడు పారిశ్రామిక వేత్త గుంతాటి వేణుగోపాల్. ఆదివారం  తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నారమల్లి శివప్రసాద్ మృతి తమ కుటుంబానికి తీరని లోట‌న్నారు‌. పార్టీలకతీతంగా ఆయన పట్ల చూపిన ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ గా, యాక్టర్ గా, పొలిటికల్ లిడర్ గా ఆయన జిల్లాకు, రాష్ట్రానికి అనిర్వచనీయమైన సేవలందించారన్నారు. జిల్లా ప్రజల పట్ల తమ కుటుంబం ఎల్లప్పుడూ సేవానిరతితో ఉంటామని చెప్పారు. తమ కుటుంబం పట్ల చంద్రబాబు, లోకేష్ చూపిన ప్రేమ, ఆదరణ ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా శివయ్యను ఆదరించిన పెద్దల ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. మీడియా శివప్రసాద్ ఉన్నతిలో చూపిన చొరవకు సర్వదా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో

About The Author