డెంగ్యూ ఫీవర్‌తో బాల నటుడు గోకుల్ సాయి కృష్ణ మృతి

తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు.తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఏవీ నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండవ కుమారుడైన గోకుల్ సాయి.. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు.దీంతోతల్లిదండ్రులు బాలుడిని బెంగళూరులోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ సాయి గురువారం రాత్రి చనిపోయాడు.

About The Author