పాకిస్తాన్ రైలులో మంటలు..16మంది సజీవ దహనం…


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. తల్వారీ రైల్వే స్టేషన్‌ దాటిన తర్వాత లియాఖత్‌పూర్‌ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు ఏకంగా మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకారశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

About The Author