పెళ్లి బరాత్‌లో డిష్యూం డిష్యూం


పెళ్లి బరాత్‌లో డిష్యూం డిష్యూం
సూర్యాపేటజిల్లా: కోదాడలో పెళ్లి బరాత్ విషయంలో ఘర్షణ చెలరేగింది. కోడాడ మండలంలోనే తోగరాయ గ్రామంలో పెళ్లైన తర్వాత ఊరేగింపుకు సిద్ధమయ్యారు. డీజేతో బరాత్ నిర్వహించాలని అబ్బాయి తరఫు బంధువులు అనుకోగా.. అమ్మాయి తరఫు బంధువులు మాత్రం బరాత్‌కు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి దాడి చేసుకునేవరకు వెళ్లింది.
అమ్మాయిది ప్రకాశం జిల్లా కావడంతో ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. డీజే వద్దంటూ అమ్మాయిని, అబ్బాయిని తీసుకువెళుతుండగా.. అబ్బాయి తరఫు బంధువులు అడ్డుకున్నారు. వారిపై దాడికి దిగారు. దీంతో రెండు కుటుంబాల తరఫువారు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పెళ్లి ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

About The Author