ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రికత్త, టియర్ గ్యాస్ ప్రయోగం

 హైదరాబాద్:- ట్యాంక్‌బండ్‌పై తీవ్ర ఉద్రికత్త కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌కు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకుంటుండటంతో. పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదీస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత ఘోర పరిస్థితి లేదని, స్వరాష్ట్రంలో మాకు ఈ పరిస్థితా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు లాఠీ చార్జ్‌ చేస్తున్న పోలీసులపై ఆర్టీసీ కార్మికులు కూడా ఎదురు దాడికి దిగుతున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ…తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వెంటాడి కొట్టడంపై కార్మికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు

About The Author