వరంగల్‌లో దారుణం జరిగింది.. పుట్టినరోజు నాడే యువతి అనుమానాస్పద మరణం…


వరంగల్‌లో దారుణం జరిగింది.. పుట్టినరోజు నాడే యువతి అనుమానాస్పద మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
హంటర్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి స్థానికులు కొందరు బాలిక మృతదేహాన్ని గుయువతిర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉండే మానస బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఫోన్ మధ్యాహ్నం నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చింది.
కుటుంబ సభ్యులు బుధవారం నుంచి గాలిస్తుండగా.. రాత్రి 10 గంటల తర్వాత ఉదయం డెడ్‌బాడీని గుర్తించారు.
కూతురిని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. పుట్టినరోజు నాడే కూతురు ఇలా విగతజీవిగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి.
మానసను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే యువతి స్నేహితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు. మానస ఎప్పుడు కలిసింది.. ఎక్కడెక్కడికి వెళ్లింది ఆరా తీస్తున్నారు.
ఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండటంతో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. దీంతో అక్కడ చీకటిగా ఉంటుంది.. యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది ఆమెకు తెలిసిన వారి పనేనా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

About The Author