టీఎస్‌-ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుక


మాదాపూర్‌ శిల్పకళావేదికలో జరిగిన టీఎస్‌-ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు శ్రీ కేటీఆర్ మరియు శ్రీ సీహెచ్ మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్‌ మాట్లాడుతూ.. టీఎస్‌-ఐపాస్‌ సీఎం కేసీఆర్‌ గారి మానసపుత్రిక అని స్పష్టం చేశారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్‌ గారు ఒక రోజంతా చర్చించి.. టీఎస్‌-ఐపాస్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నాం. ఓఆర్‌ఆర్‌ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్‌ సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.

కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తామని. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లు అపోహలు సృష్టించారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి. హైదరాబాద్‌ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించామని, ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశామన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాలంటే భారీ ప్రాజెక్టులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిబద్ధతతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నామని . పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
#TSiPASS
#5YearsOfTSiPASS

About The Author