మచిలీపట్నం కు చెందిన షేక్.హాజి హుస్సేన్(28) మృతి.


మచిలీపట్నం కు చెందిన షేక్.హాజి హుస్సేన్(28). iTBP (ఇండో టేబిటెన్ బోర్డర్ పోలీస్) గా పనిచేస్తూ ఉత్తరఖాండ్ లో నీలం యూనిట్లో నిన్న సాయంత్రం మృతి.
రేపు స్వస్థలం మచిలీపట్నం చేరుకోనున్న పార్థివదేహం. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న తల్లిదండ్రులు, జలాల్ పేటలో అలుముకున్న విషాద ఛాయలు.
మృతుడు హాజి హుస్సేన్ కు వచ్చే మే నెలలో వివాహానికి కుటుంబ సభ్యులు సన్నాహాలు. సంవత్సరాలలో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2013 లో రాంచీ బోర్డర్లో దేశానికి మొదటిసారిగా సేవలందించారు.
ఈ నెల 2 వతారీఖున తన తల్లిదండ్రులకు తండ్రి షేక్ మహబూబ్( లారీ డ్రైవర్), తల్లి షకీలా భేగం లకు కాల్ చేసి డిసెంబర్ 15 న తన మేనమామ వివాహానికి హాజరవుతునాని, మోకాలు లోతు మంచులో ఉత్తరఖాండ్ నీలం యూనిట్లో ఉన్నట్లు తెలియచేశారు.

About The Author