షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం…


బ్రేకింగ్ న్యూస్
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని సుప్రీం పేర్కొంది. రిటైర్డ్ న్యాయమూర్తితో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. రిటైర్డ్ జడ్జీ ఢిల్లీ నుంచే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తారని పేర్కొంది. రేపటికి ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తుల పేర్లతో రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు తాజా వార్తలు #దిశ నిందితులు ఎన్కౌంటర్

About The Author