తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈ రోజు సోమవారం,  23.12.2019   ఉదయం 5 గంటల సమయానికి,  తిరుమల: 16C°-24℃

నిన్న 85,869,మంది   భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి   దర్శన భాగ్యం కల్గినది,

స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లో 26 గదిలో భక్తులు వేచిఉన్నారు,

ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు  16గంటలు   పట్టవచ్చును,నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.07,కోట్లు,

 

నిన్న 32,489 మంది  భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి   మొక్కులు తీర్చుకున్నారు  శీఘ్రసర్వదర్శనం(SSD),   ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం   (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం  పట్టవచ్చును,₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి  శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక  విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,

గమనిక

జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా_ రద్దీని దృష్టిలోఉంచుకునిదాత‌ల‌కు,చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు, వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను నిలుపుద‌ల చేయ‌డ‌మైన‌ది.నూతనఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగాడిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు,  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4,నుండి 7వ తేదీ వరకు  దాతలకు ప్రత్యేకదర్శనాలు, గదులకేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.భక్తుల రద్దీ నేపథ్యంలోనూ,సంవత్సరాది,సందర్భంగాడిసెంబరు 31, జనవరి,1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5,నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు,చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

ఈనెల తిరుమలలోప్రత్యేక ఉత్సవాలు

25న శ్రీతొండ‌ర ‌డిప్పొడియాళ్వార్వ‌ర్ష తిరున‌క్షత్రం. 26న సూర్య‌గ్ర‌హ‌ణం31 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ,మ్యూజియం ఎదురు గలకౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!)మరియు దివ్యాంగులకుప్రతిరోజు 1400 టోకెన్లుజారీ చేస్తున్నారు.ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియుమ:2గంటలకి,దర్శనానికి,అనుమతిస్తారు,చంటిపిల్లలతల్లిదండ్రులుఎన్నారైప్రత్యేక,దర్శనాలుసుపథంప్రవేశంద్వారాస్వామి ,దర్శనానికిఅనుమతిస్తారు,ఉ:11నుండిసా:5గంటల వరకు,దర్శనానికి అనుమతిస్తారు,

           శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_కావున లెమ్ము స్వామి

About The Author