ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి సమీపంలో 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరిగిన ఘటన. సింహాచలం నుండి బరంపురం(ఒడిస్సా) వెళ్తున్న కారు(OD 02 BB 2282) అదుపు తప్పి కల్వర్టు లో దూసుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.

ముగ్గురు మహిళలు,ఇద్దరు పురుషులు, ఒక చంటి పాపతో పాటు మొత్తం ఆరుగురు ఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. మృతులంతా ఒడిస్సా కి చెందిన వారిగా మందస పోలీసులు గుర్తించారు

About The Author