ఏపీ లో దారుణం.. రైల్లో నుంచి హోంగార్డు ని తోచేసిన ఓ ఉన్మాది

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి హోంగార్డును కిందకు తోసేశాడు ఓ ఉన్మాది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. వైజాగ్ వైపునకు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. రైల్లో ఉన్న ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడ్ని ఓ హోంగార్డు బలంగా అడ్డుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివగా గుర్తించారు. అతడు కోటనందూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండేవాడని అధికారులు గుర్తించారు.

About The Author