రాష్ట్ర మంత్రి బొత్సాసత్యనారాయణ గారికి ఘనంగా,స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంటలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆదివారం తుమ్మల గుంట కు చేరుకున్న మంత్రికి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుతల్లి విగ్రహం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద వేద పండితులు మంత్రికి పూర్ణకుంభం స్వాగతం పలికారు. స్వామి దర్శనాంతరం మంత్రిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రాశస్త్యం గురించి చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి చెవిరెడ్డి నీ అభినందించారు.

 

About The Author