జర్నలిస్టు రాజేశ్వరరావుకు ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు…


గత ముప్పై ఏళ్లుగా జర్నలిజం లో ఉంటూ,కవిగా రాణిస్తూ, ప్రస్తుతం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ కార్యదర్శిగా కొనసాగుతున్న కొండా రాజేశ్వరరావుకు ప్రముఖ ఇంటర్నేషనల్ ఇండియన్ అవార్డు లభించింది. హైదరాబాదు లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వరల్డ్ ఇంగ్లీషు రైటర్స్ యూనియన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డును అందుకున్నారు. జర్నలిస్టుగా, కవిగా, సామాజిక వేత్తగా పలు సేవలు అందిస్తున్నందుకు గాను ప్రముఖ సినీగేయ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వడ్డేపల్లి కృష్ణ హాజరుకాగా, అతిధులుగా జర్నలిస్టులు కొండా రాజేశ్వరరావు, అనుమోలు జయప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాయప్రోలు రామకృష్ణ, బాల భవన్ డైరెక్టర్ సుభద్రా దేవి,ఫిల్మ్ ఆర్టిస్ట్, యాంకర్ చిత్రలేఖ, సంస్థ వ్యవస్థాపకులు, యువకవి మల్లెల మస్తాన్ పాల్గొని ప్రసంగించారు.

About The Author