కోవిడ్-19 కేసులు లేవని రిలాక్స్ అవ్వొద్దు..


గాంధీ ఆసుపత్రిలో పలు మార్పులు చేయాలి.. వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి ఈటల ఆదేశం.

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. కోవిడ్ -19 వ్యాప్తి ని సమర్ధవంతంగా నియంత్రిచగలిగినందుకు కేంద్ర మంత్రి హర్ష వర్ధన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్య శాఖను అభినందించారని… దానికోసం కష్టపడుతున్న అధికారులు, సిబ్బంది అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అయితే రిలాక్స్ అవ్వవద్దని కోరారు. దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అప్రమత్తత కొనసాగించాలని ఆదేశించారు. విదేశాలనిండి రాష్టానికి వస్తున్న ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టాలని కోరారు.

అపోహలు అనుమానాల నేపథ్యంలో భరోసా కలిపించేందుకే గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తి దగ్గరికి స్వయంగా వెళ్లి వచ్చానని మంత్రి అన్నారు. అతని ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నానని, వేగంగా కోలుకుంటున్నారని అయన చెప్పినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల కోసం వచ్చిన పలువురి తో కూడా మంత్రి మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రి సూచించారు. చికిత్స అందిస్తున్న 7 వ ఫ్లోర్ లోకి ఎవరూ ప్రవేశించకుండా అన్ని ద్వారాలు మూసివేయాలని కోరారు.
ఐశొలేషన్ వార్డ్ లో కూడా రెండు విభాగాలు చేయాలని.

1. విదేశాలకు వెళ్లి వచ్చిన లేదా వారితో కలిసి ఉండి జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారికి ఒక దగ్గర ..
2. విదేశాలకు వెళ్లి వచ్చి కరోనా వైరస్ లక్షణాలు లేని వారిని మరో వార్డు లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

గాంధీ కి వస్తున్న ప్రతి ఒక్కరినే వైరస్ పాజిటివ్ ఉంటే ఎలా ప్రొటోకాల్ పాటిస్తమో అలానే జాగ్రత్త వహించాలని మంత్రి ఆదేశించారు.

విదేశాలనుండి రాష్ట్రం కి వచ్చిన ప్రతి వ్యక్తి హాస్పిటల్ కి రాకపోయినా, లక్షణాలు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటివద్దే ఐసోలేషను లో ఉంచాలని, ప్రతి రోజూ వైద్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని మంత్రి కోరారు.

ఈ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం తరపున NCDC ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రణయ్ లతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. Covid-19 వైరస్ కోసం కేంద్రం రూపొందించిన నియమావళిని వారు మంత్రికి వివరించారు.

About The Author