తెలంగాణనల్గొండమారుతీరావు ఆత్మహత్యకు కారణం ఇదేనా..!?


హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతుండటంతో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే.. ఆత్మహత్యకు ఇది కూడా ఓ కారణమేననని అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.

వాళ్లు వేధించారా!?

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ట్రయల్స్ మొదలయ్యాయి. అయితే ఈ హత్య కేసులో శిక్ష తప్పదని కొన్నాళ్లుగా మారుతీరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని సమాచారం. ఈ క్రమంలో వారం రోజుల కిందట ఆస్తులను భార్య పేరుతో వీలునామా రాశాడు. తమ్ముడు శ్రవణ్ కుమార్‌తో ఆస్తి పంపకాలు పూర్తి చేసుకున్నాడు. శ్రవణ్ కూడా ప్రణయ్ హత్య కేసులో నిందితుడన్న విషయం తెలిసిందే. హత్య కేసులో అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలు మారుతీరావును వేధించేవారని సమాచారం. శిక్ష తప్పదని తెలియడంతో నిందితులు భారీగానే డబ్బు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

About The Author