ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..


తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్టీసీకి.. ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 60 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కాగా, సీఎం.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారినికై బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే.

సమ్మె సందర్భంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయడంతో పాటు, వారి డ్యూటీ రాత్రి 8 గంటల వరకు ముగిసేలా చర్యలు తీసుకున్నారు.

About The Author