చిత్తూరులో దారుణం.. ఓ వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి


చిత్తూరు : జిల్లాలోని కేవీపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేపట్టిన వెయ్యి రూపాయలలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను.. ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా..? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్.. ఆ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. 
పూర్తి వివరాల్లోకెళితే.. కేవీ పల్లి మండలం బంధార్లపల్లిలో వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్..? ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా..? అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని పై ఎస్ ఐ రామమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

About The Author